Monday, January 9, 2012

మూసీనాలాలాను అభివృద్ధి చేయాలి

సిపిఎం 19వ నగర మహాసభల్లో తీర్మానము   ప్రవేశపెట్టారు. 
 నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించి మూసీనాలాను అభివృద్ధి చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నట్లు నాంపల్లి జోన్‌ కన్వీనర్‌  ఎం  వెంకటేష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూసీ నాలా కబ్జాలకు గురౌతోందని, చిన్నపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురౌతున్నాయని తెలిపారు. మూసీనది సుందరీకరణపేరుతో కోట్లరూపాయలతో రబ్బర్‌డ్యాంలు నిర్మించారని, వాటివల్ల మురుగునీరు పేరుకుపోయి దోమల బెడద పెరిగి స్థానిక ప్రజలు రోగాలకు గురౌతున్నారన్నారు. మూసీలో కబ్జాలకు పాల్పడుతున్నారని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నాలాకు ఇరువైపులా ఫెన్సింగ్‌ లేక అఫ్జల్‌సాగర్‌లో 2009లో ఇద్దరు పిల్లలు చనిపోయారన్నారు. కొంతమంది నాలాపై ఇళ్లు కట్టుకున్నారని వారికి పునరావాస నివాసాలు కల్పించి నాలాను అభివృద్ధి చేయాలని కోరారు. కిర్లోస్కర్‌ కన్సల్టెన్సీ సూచనలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రజాశక్తి సౌజన్యంతో..... 

No comments:

Post a Comment