Monday, May 16, 2011

దుర్మార్గమైన నిర్ణయం


పెట్రోల్‌ రేటును లీటర్‌కు ఐదు రూపాయలకు పైగా పెంచడం దుర్మార్గమైన చర్య. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఈ తరహా బహుమానం ఇచ్చింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. దీనికోసం ప్రజాక్షేత్రంలో సిపిఎం ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఈ భారం వారిని ఆర్థికంగా మరింత కుంగదీస్తుంది. ధరలు పెంచకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదు.
పిఎస్‌ఎన్‌ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి

Monday, May 2, 2011

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి...

              కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని  సి.పి.యం. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. మేడేను పురస్కరించుకుని సి.పి.యం. నగర కార్యాయంలొ   పార్టీ సినియర్ నాయకులు  టి.వి. చారి గారు  జెండా ఎగురవెశారు.
              ప్రపంచ బ్యాంక్‌ విధానాలు అమలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతనాలు పెంచడంతో ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడే స్ఫూర్తితో వివిధ రంగాల్లో విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్మికులంతా ఏకతాటిపై నడిచి తమ హక్కులను సాధించుకోవాలని పిఎస్‌ఎన్‌ మూర్తి పిలుపునిచ్చారు.

కార్మికుల ఐక్యతే సమస్యలకు పరిష్కారం...

             కార్మికులు ఐక్యంగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ఉంటుందని సిఐటియు నగర ఉపాధ్యక్షులు పిఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. మేడేను పురస్కరించుకుని గాంధీనగర్‌ డివిజన్‌లోని అశోక్‌నగర్‌లోని లేబర్‌ అడ్డా, గాంధీనగర్‌ చౌరస్తా, ఆంధ్రకేఫ్‌, ఎస్‌ఆర్‌టి జవహర్‌ స్కూల్‌ ఆటో అడ్డాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు.                     
              అశోక్‌నగర్‌ లేబర్‌ అడ్డా వద్ద జరిగిన జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై కపట ప్రేమను చూపిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు మేడే ఒక గొప్ప రోజని అభివర్ణించారు. 18 గంటల పని రోజులను ఎనిమిది గంటలకు కుదించుకోవడం కోసం పోరాటం చేసి, విజయం సాధించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ఉనికిని చాటు కోవడానికి పాట్లు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం ముందుండాలని, వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని అన్నారు. కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తూ సహజ మరణం పొందిన సదానంద్‌ భార్య చంద్రకళకు బిసిడబ్యూ ఇన్స్‌రెన్స్‌ స్కిమ్‌ కింద 30 వేల రూపాయల చెక్కును పిఎస్‌ఎన్‌ మూర్తి అందజేశారు. 
                 ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం దశరథ్‌, ఎస్‌ దశరథ్‌, రాంచందర్‌, శ్రీదేవి, క్రిష్ణస్వామి, రాము, రాజు, సాయి రమేష్‌, ఎల్లయ్య, సోమయ్య, యాకయ్య, వెంకటయ్య, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.