Monday, January 9, 2012

మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలి

                  సిపిఎం 19వ నగర మహాసభల్లో తీర్మానము   ప్రవేశపెట్టారు. 
                     సరళీకరణ విధానాల వల్ల మహిళలపై హింస పెరిగిందని శశికళ పేర్కొన్నారు. పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, అసహాయత, అభద్రత వల్ల నేరాలు, గృహహింస విపరీతంగా పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హింసను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బడ్జెట్‌లో మహిళలకు వాటా పెంచాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. మహిళల సమస్యల పట్ల సమగ్ర అవగాహన, నిబద్ధత ఉన్న వారిని మహిళా కమిషనర్‌గా నియమించి కమిషన్‌ను పునర్‌ వ్యవస్థీకరించాలని కోరారు. గృహహింస చట్టంతోపాటు మహిళా రక్షణ చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలన్నారు. అందుకు కావాల్సిన నిధులు, ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలని, బెల్టుషాపులను రద్దుచేయాలని కోరారు. ఇలా దాదాపు 10 డిమాండ్లను తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే డిమాండ్ల సాధనకోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....  ) 

No comments:

Post a Comment