హైదరాబాద్ లో ముషీరాబాద్ జోన్ గాంధీనగర్ డివిజన్లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పాదయాత్రలో పలు బస్తీలైన శాంతి యువజన సంఘం, కెవిఎన్ చారినగర్, డప్పులయ్యబస్తీ, ఎస్ఆర్టీ క్వార్టర్స్, వాల్మీకీనగర్లో పలు సమస్యలు నాయకుల దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శివర్గ నాయకుడు ఎం.దశరథ్ మాట్లాడుతూ వివిగిరినగర్, డప్పులయ్యబస్తీ, అన్నానగర్ బస్తీవాసులకు ఇళ్లపట్టాలివ్వాలని, ఎస్ఆర్టీ వాకర్గ్రౌండ్లో నివసిస్తున్న పేద వారికి గుడిసెలిచ్చి, అర్హులైన వారికి ఇళ్ళపట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. డివిజన్లో పాడైన రోడ్లను ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్త చేశారు. రాత్రిపూట వీధి లైట్లు వెలగడం లేదని వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య, వితంతువు, వికలాంగ ఫించన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రజాపోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో కన్వీనర్ ఎస్.దశరథ్, రాంచందర్, యాదగిరి, అబ్బురాములు, రమేష్, హరి, హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment