Tuesday, April 26, 2011

స్థానిక సమస్యల పరిష్కా రానికి సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర

            హైదరాబాద్ లో ఉప్పల్  హబ్సిగూడ డివిజన్‌ పరిధిలోని స్థానిక సమస్యల పరిష్కా రానికి హబ్సిగూడ డివిజన్‌ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఉప్పల్‌ జోన్‌ కార్యదర్శి కె.రవి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు పి.గణేష్‌, ఐద్వా జోన్‌ కార్యదర్శి వినోద పాల్గొని రామాంతాపూర్‌ చెరువులో పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామంతాపూర్‌ చెరువులోని గుడిసెల్లో సమస్యలు, తాగునీటి సమస్యలు, దోమల సమస్యలు అధికంగా ఉన్నాయని, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చెరువులో ఉండడం వలన పాములు, తేళ్ళు అధికంగా వస్తున్నాయని, కరెంటు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
             గాంధీ గిరిజన బస్తీలో రేషన్‌కార్డులు లేవని, రేషన్‌కార్డులు ఉన్నా రేషన్‌ ఇవ్వడం లేదని మురికినీటి సమస్య, ఇంటి సమస్య ఉందని బస్తీవాసులు వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ డివిజన్‌ సిపిఎం నాయకులు జె.వెంకన్న, డివైఎఫ్‌ఐ సెక్రటరీ కె.విజరు, హబ్సిగూడ డివిజన్‌ కమిటీ ఐద్వా నాయకురాలు నాగలక్ష్మి, అంజమ్మ, సత్యవతి, కైదర్‌బీ, ఆశా, పరంగిని, రుక్కా, కమల, రాజమణి, పార్వతమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment