హైదరాబాద్ లో ముషీరాబాద్ జోనులోని బాగ్ లింగంపల్లి డివిజన్లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం బాగ్ లింగంపల్లి కమిటీ ఆధ్వర్యంలో బాగత్ సింగ్ నగర్, శ్రిరాం నగర్, సంజయ్ నగర్, అచ్చయ్య నగర్, పాలమూరు.... బస్తీలలో కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఎం కార్యదర్శి పి.ఎస్.ఎన్.మూర్తి, ప్రారంభించి మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న స్థానిక బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు. రేషన్ సమస్యలు, పెన్షన్లు తదితర సమస్యలతో సతమతమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు స్థానికుల సమస్యలను గాలికి వదిలేసి వారి పనులను చక్కబెట్టుకుంటునరన్నారు. బస్తీలలోని ప్రజలు అనేక సమస్యలను ఈ పాదయాత్రలో నాయకులకు తెలిపారు.
రాజీవ్గృహకల్ప కోసం కట్టిన డబ్బులు ఆరు సంవత్సరాలు కావస్తోన్న ఇంత వరకు ఇళ్ళు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీవ్యవస్థ సరిగాలేక నిత్యం రోడ్డుపైన మురుగునీరు చేరుతుందన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర లో సిపిఎం ముషీరాబాద్ జోను కార్యదర్శివర్గ సభ్యులు పి. గెల్వయ్య, డివిజన్ నాయకులు జి.రాములు, వెంకన్న, రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment