హైదరాబాద్ లో ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ డివిజన్లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం దోమలగూడ కమిటీ ఆధ్వర్యంలో పూల్బాగ్, మైసమ్మబండ, జ్యోతినగర్, దేవిప్రసాద్బాగ్, తాళ్లబస్తీ, బండనగర్, సూరజ్నగర్, ఈశ్వరమ్మబాడ, ఎంసిహెచ్ క్వార్టర్స్, గంగానగర్, బ్యాంక్కాలనీలో కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్రలో సిపిఎం ముషీరాబాద్ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్ పూల్బాగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించి మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న స్థానిక బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు. రేషన్ సమస్యలు, పెన్షన్లు తదితర సమస్యలతో సతమతమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు స్థానికుల సమస్యలను గాలికి వదిలేసి వారి పనులను చక్కబెట్టుకుంటునరన్నారు. బస్తీలలోని ప్రజలు అనేక సమస్యలను ఈ పాదయాత్రలో నాయకులకు తెలిపారు. రాజుకాలనీలో కమ్యూనిటీహాల్ నిర్మించాలని, అశోక్నగర్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు వేయాలని, రాజీవ్గృహకల్ప కోసం కట్టిన డబ్బులు ఆరు సంవత్సరాలు కావస్తోన్న ఇంత వరకు ఇళ్ళు ఇవ్వలేదన్నారు. సూరజ్నగర్లో మంచినీటిలో కలుషితనీరు కలసి వస్తోందన్నారు. డ్రెయినేజీవ్యవస్థ సరిగాలేక నిత్యం రోడ్డుపైన మురుగునీరు చేరుతుందన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రకు సిపిఎం డివిజన్ కన్వీనర్ సిహెచ్.శ్రీనివాస్ నాయకత్వం వహించగా, డివిజన్ నాయకులు మహ్మద్ యూసఫ్, జి.సంతోష్, కృష్ణ, పొన్నస్వామి, హనుమంతు లక్ష్మయ్య, శ్రీను, ఎల్లయ్య, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment