సిపిఎం నగర కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తిమాకినేని బసవపున్నయ్య భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సైద్ధాంతిక యోధుడని సిపిఎం నగర కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి అన్నారు. గురువారం నగర కార్యాలయంలో ఎంబి 20వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకులు టివి చారీ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో పిఎస్ఎన్ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అతివాద, మితవాద పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులలో అగ్రగన్యుడన్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం పెను సవాళ్లను ఎదుర్కుంటున్న సమయంలో సరైనా పంథాను ప్రజలముందుంచడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. అతివాదం కమ్యూనిస్టు ఉద్యమానికి ఎలా నష్టమో సైద్ధాంతికంగా, పరిశీలనాత్మకంగా అనేక వ్యాసాల ద్వారా నాటి యువ కమ్యూనిస్టులకు తెలియజేశారన్నారు. అదే విధంగా మితవాద ప్రమాదాన్ని కూడా ఎత్తిచూపారన్నారు. ప్రజాఉద్యమాలతోపాటు చట్టసభలలో కూడా ప్రజాసమస్యలను ఎజెండా మీదకు ఎలా తేవాలో తెల్సిన వ్యక్తి ఎంబి అని కొనియాడారు. ప్రజాసంఘాలను నిర్మించి ప్రజలను పోరాటాల్లో భాగస్వాములను చేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు జె.వెంకటేష్, ఎం.శ్రీనివాస్రావు, ఎన్.సోమ య్య, జిల్లా నాయకులు కె.ఈశ్వర్రావు, ఎం.దశరథ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Friday, April 13, 2012
ఆయనో సైద్ధాంతిక యోధుడు
సిపిఎం నగర కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తిమాకినేని బసవపున్నయ్య భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సైద్ధాంతిక యోధుడని సిపిఎం నగర కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి అన్నారు. గురువారం నగర కార్యాలయంలో ఎంబి 20వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకులు టివి చారీ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో పిఎస్ఎన్ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన అతివాద, మితవాద పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులలో అగ్రగన్యుడన్నారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం పెను సవాళ్లను ఎదుర్కుంటున్న సమయంలో సరైనా పంథాను ప్రజలముందుంచడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. అతివాదం కమ్యూనిస్టు ఉద్యమానికి ఎలా నష్టమో సైద్ధాంతికంగా, పరిశీలనాత్మకంగా అనేక వ్యాసాల ద్వారా నాటి యువ కమ్యూనిస్టులకు తెలియజేశారన్నారు. అదే విధంగా మితవాద ప్రమాదాన్ని కూడా ఎత్తిచూపారన్నారు. ప్రజాఉద్యమాలతోపాటు చట్టసభలలో కూడా ప్రజాసమస్యలను ఎజెండా మీదకు ఎలా తేవాలో తెల్సిన వ్యక్తి ఎంబి అని కొనియాడారు. ప్రజాసంఘాలను నిర్మించి ప్రజలను పోరాటాల్లో భాగస్వాములను చేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు జె.వెంకటేష్, ఎం.శ్రీనివాస్రావు, ఎన్.సోమ య్య, జిల్లా నాయకులు కె.ఈశ్వర్రావు, ఎం.దశరథ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment