Monday, May 2, 2011

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి...

              కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని  సి.పి.యం. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. మేడేను పురస్కరించుకుని సి.పి.యం. నగర కార్యాయంలొ   పార్టీ సినియర్ నాయకులు  టి.వి. చారి గారు  జెండా ఎగురవెశారు.
              ప్రపంచ బ్యాంక్‌ విధానాలు అమలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతనాలు పెంచడంతో ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడే స్ఫూర్తితో వివిధ రంగాల్లో విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్మికులంతా ఏకతాటిపై నడిచి తమ హక్కులను సాధించుకోవాలని పిఎస్‌ఎన్‌ మూర్తి పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment