Friday, April 1, 2011

cpi(m) hyd. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ధర్నా

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ధర్నా

     పెరుగుతున్న విద్యుత్‌ ధరలకు నిరసనగా సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ డిఇ కరెంటు కార్యాలయం ముందు గురువారం నాడు సికింద్రాబాద్‌ జోన్‌ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎన్‌.సోమయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేద, మద్య తరగతి కుటుంబాలకు ఉచిత విద్యుతంటూ, ఎలక్షన్లు ముగిసిన తరువాత విద్యుత్‌ ధరలు పెంచి ప్రజలను ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్‌ పోరాటాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు చేసిందన్నారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం నిత్యావసరాల ధరల్ని పెంచి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్‌ ధరలు పెంపు నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని, చివరికి పేద ప్రజలే పెద్ద ఎత్తున విద్యుత్‌ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్‌ కార్యదర్శి ఆర్‌.మల్లేష్‌, సికింద్రాబాద్‌ కన్వీనర్‌ అజరుబాబు, సనత్‌నగర్‌ కన్వీనర్‌ పి.వెంకటేష్‌, సికింద్రాబాద్‌ డివైఎఫ్‌ఐ నాయకులు మహేందర్‌, ఐద్వా నాయకురాలు శారద, వీరలక్ష్మి, అంజమ్మ, లక్ష్మి, నాయకులు సుకియాన్‌, యాదగిరి, రాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment